Cricket: వరల్డ్‌కప్‌కి ముందు పాకిస్థాన్ కీలక పర్యటన

Cricket: వరల్డ్‌కప్‌కి ముందు పాకిస్థాన్ కీలక పర్యటన
మే 22, 2024లో ప్రారంభమవనున్న సిరీస్

బాబర్ ఆజాం సారథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. 2024లో T20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో దాని కన్నా ముందే ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ జట్లు సన్నాహకంగా 4 మ్యాచ్‌ల T20 సిరీస్‌ కోసం ఇరు బోర్డులు అంగీకారం కుదుర్చుకున్నాయి. 2024 సంవత్సరం మేలో ఈ పర్యటన ఉండనుంది.

మే 22న లీడ్స్‌లో మొదటి T20తో ఈ సిరీస్ ఆరంభమవనుంది. మే 25న బర్మింగ్‌హాంలో 2వ మ్యాచ్, కార్డిఫ్‌లో మే 28న మూడవ మ్యాచ్, 4వ టీ20 మే 30న ఓవల్‌లో జరగనున్నాయి. ఈ సిరీస్‌ అనంతరం ఇరు జట్లు వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కి పయనమవుతాయి.


అయితే 2022 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఇంగ్లాండ్‌కి పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చింది. 7 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు పాక్‌ను 4-3 మ్యాచ్‌ల తేడాతో ఓడించింది. అనంతరం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఈ జట్లే తలపడ్డారు. ఫైనల్లో పాకిస్థాన్‌ని ఇంగ్లాండ్ ఓడించి వరల్డ్‌కప్ గెలిచింది. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చే జట్టు ఇంగ్లాండ్‌ అయింది.
ఇంగ్లాండ్‌తో ఈ సిరీస్‌ కంటే ముందే పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో పర్యటించనుంది. ఆ పర్యటన వివరాలు తర్వాత ప్రకటించనున్నారు.

షెడ్యూల్ ఇదే..

4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌

==> తొలి T20- మే 22- హెడింగ్లీ, లీడ్స్‌

==> రెండో T20- మే 25- ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం

==> మూడో T20- మే 28- సోఫియా గార్డెన్స్‌, కార్డిఫ్‌

==> నాలుగో T20- మే 30- ఓవల్‌, లండన్‌

వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌ స్వదేశంలో వెస్టిండీస్ ( జులై 10-30 ), శ్రీలంక( ఆగస్ట్ 21- సెప్టెంబర్ 10 ) జట్లకు టెస్ట్‌ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టుతో 3 టీ20లు, 5 వన్డేల్లో తలపడనుంది.

పురుషుల క్రికెట్‌కి సమాంతరంగానే ఇంగ్లాండ్, పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ద్వై పాక్షిక సిరీస్ ఖరారైంది. ఈ పర్యనలో ఇరుజట్లు 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story