pant: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ అవుట్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్కు పంత్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడ్డాడు. పంత్ కుడి పాదం ఫ్రాక్చర్ కావడంతో సిరీస్ చివరి టెస్ట్కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తుంది. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’’ అని బీసీసీఐ పేర్కొంది. కాగా పంత్ స్థానాన్ని తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్తో భర్తీ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ది ఓవల్ వేదికగా జరగనున్న చివరి టెస్టులో పంత్ స్థానంలో జగదీశన్ ను బీసీసీఐ సెలక్ట్ చేసింది.
జట్టు కష్టాల్లో ఉండటంతో గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఓ పోరాట యోధుడిలా తిరిగి బ్యాటింగ్కు వచ్చి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు పంత్. కాలు ఫ్రాక్చర్ కావడంతో తిరిగి కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో పంత్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న పంత్ భారత్కు కీలకమైన ఐదో టెస్టుకు దూరం కావడం టీమిండియాకు ఎదురు దెబ్బనేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. నాలుగో టెస్టు డ్రా కావడంతో ఇక అయిదో టెస్టు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com