OLYMPICS: భారత పతాకధారిగా శ్రీజేష్‌

OLYMPICS: భారత పతాకధారిగా శ్రీజేష్‌
X
ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాకు అరుదైన గౌరవం... వెల్లడించిన పీటీ ఉష

ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో పతాకధారిగా సీనియర్‌ హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు భారత ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది. క్రీడాకారుల అభీష్టం మేరకు భారత యువ షూటర్‌ మను బాకర్‌తోపాటు శ్రీజేశ్‌ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు. శ్రీజేశ్‌ గత రెండు దశాబ్దాలకుపైగా భారత్‌ క్రీడలకు, హాకీకి అద్భుతమైన సేవలందించారన్నారు. జావెలిన్‌ త్రోలో రజతం సాధించిన నీరజ్‌ చోప్రాతో తాను మాట్లాడానని.. ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ పతాకధారిగా ఉండేందుకు అతడు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనను అడగకపోయినా..తాను శ్రీ భాయ్‌ పేరు నీరజ్‌ పేర్కొన్నట్లు ఉష తెలిపారు.

ముగిసిన శ్రీజేష్ శకం

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ కాంస్య పతకం సాధించిన క్షణమది. భారత ఆటగాళ్లంత ఒకవైపు నిలబడి ఉన్నారు. మరోవైపు.. శ్రీజేష్‌ నిలబడి ఉన్నాడు. శ్రీజేష్‌కి భారత హాకీ జట్టు ఆటగాళ్లందరూ, సిబ్బంది... మైదానంలోని అభిమానులు అందరూ శ్రీజేష్‌ సేవలకు గుర్తుగా నడుం వచ్చి చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ అపురూప దృశ్యం భారత అభిమానుల మదిలో చాలాకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే శ్రీజేష్‌.. భారత హాకీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ తన కెరీర్‌ను ముగించాడు. స్పెయిన్‌తో జిరిగిన కాంస్య పతక పోరులో విజయం సాదించగానే మైదానంలో శ్రీజేష్‌ పూర్తిగా కిందపడుకుని తన హాకీ గేర్‌కు నమస్కరించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని ఖాయం చేసి తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ముగించి ఘనమైన వీడ్కోలు అందుకున్నాడు. సహచర ఆటగాళ్ల నుంచి శ్రీజేష్‌ ఘన వీడ్కోలు అందుకున్నాడు. 2006లో భారత్‌ హాకీ జట్టులోకి అరంగేట్రం చేసిన శ్రీజేష్... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు కాంస్య పతక విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అవును సుదీర్ఘ కెరీర్‌లో భారత జట్టుకు మూల స్తంభంలా మారాడు. శ్రీజేష్‌ అద్భుత కెరీర్‌లో భారత గోల్‌పోస్ట్ ముందు కంచు కోటను నిర్మించాడు. క్లిష్టమైన పెనాల్టీ కార్నర్‌లను ఆపి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. శ్రీజేష్ 36 సంవత్సరాల వయస్సులో.. 18 సంవత్సరాల కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా చేసుకుని వెనుదిరిగాడు.భారత హాకీ చరిత్రలో శ్రీజేష్‌ చెరగని ముద్ర వేశాడు. అలాంటి శ్రీజేష్‌కు ఒలింపిక్స్‌ కాంస్య పతకంతో భారత హాకీ జట్టు ఘనమైన వీడ్కోలు పలికింది. . రిటైర్మెంట్‌కు ముందు తన చివరి మ్యాచ్‌ ముగియడంతో శ్రీజేష్ భావోద్వేగానికి గురయ్యాడు.

Tags

Next Story