PV SINDHU: పీవీ సింధు నిష్క్రమణ

సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గురువారం భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ –చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, ప్రణయ్కు చుక్కెదురైంది. వరల్డ్ నంబర్ 5 చెన్ యుఫే (చైనా) చేతిలో తొలి సెట్ను 9-21తో కోల్పోయిన సింధు.. రెండో సెట్ను సొంతం చేసుకున్నప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్లో తేలిపోయింది. ఇతర మ్యాచ్ల్లో మాళవిక బాన్సోద్ 21-19, 18-21, 8-21తో పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి కశ్యప్ 9-21, 8-21తో పుత్రి కుసుమ వర్దని (ఇండోనేసియా) చేతిలో, ఉన్నతి హుడా 12-21, 20-22తో లిన్ సియాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ప్రణయ్ 19-21, 21-17, 21-16తో కెంటా నిషిమోటో (జపాన్)పై, శ్రీకాంత్ 23-21, 13-21, 21-11తో గ్వాంగ్ జు (చైనా)పై, కరుణాకరన్ 21-13, 21-14తో మూడో సీడ్ తీన్ చెన్ (చైనీస్ తైపీ)పై, ఆయుష్ 20-22, 21-10, 21-8తో బ్రయాన్ యాంగ్ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రియాన్షు రజావత్ 15-21, 17-21తో హెంగ్ జేసన్ చేతిలో ఓడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com