బీసీసీఐకి రోజర్ బిన్నీ రాజీనామా.. తాాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా

బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ వయో పరిమితి నిబంధన కారణంగా రాజీనామా చేయనున్నారు. కొత్త అధ్యక్షుడు ఎంపిక త్వరలో జరగనున్నందున తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత మాజీ క్రికెటర్ మరియు ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితి నిబంధన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధ్యక్షుడిగా కొనసాగుతున్న పదవిని ఖాళీ చేయాల్సి ఉంటుంది.
జూలై 19న బిన్నీకి 70 ఏళ్లు నిండుతాయి. బోర్డు నిబంధనల ప్రకారం, 70 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత' ఏ వ్యక్తి కూడా ఏ పదవిని నిర్వహించలేరు.
'అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు'. కావునా శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. "అపెక్స్ కౌన్సిల్ జనరల్ బాడీ ద్వారా అతనికి అధికారం ఇవ్వబడే విధులను కూడా ఉపాధ్యక్షుడు నిర్వర్తించాలి" అని BCCI నియమాలు సూచిస్తున్నాయి.
బీసీసీఐ ఆఫీస్ బేరర్ల తదుపరి సెట్ ఎన్నికలు జరిగే సెప్టెంబర్ వరకు శుక్లా అధ్యక్షుడిగా పదవీకాలం కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అయిన శుక్లా చాలా కాలం క్రికెట్ నిర్వాహకుడిగా ఉన్నారు. జర్నలిస్ట్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన శుక్లా (65) 2011 నుండి 2017 వరకు ఐపీఎల్ కమిషనర్గా ఉన్నారు. 2020లో, శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2022లో కూడా ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com