RCB: ఆర్సీబీ విజయోత్సవంలో మృత్యు ఘోష

RCB: ఆర్సీబీ విజయోత్సవంలో మృత్యు ఘోష
X
చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. 11 మంది అభిమానుల మృతి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ.. ఐపీఎల్‌లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.జనాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని తెలుస్తుంది. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్‌ టాప్‌ బస్‌లో విక్టరీ పరేడ్‌ను ప్లాన్‌ చేసింది. అయితే ఈ సమస్యలను ముందే ఊహించి పోలీసులు విక్టరీ పరేడ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలిరావడంతో పోలీసులు కంట్రోల్‌ చేయలేకపోయారు. లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట వల్ల 11 మంది చనిపోయి తీవ్ర ఈ ఘటన తర్వాత కూడా స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు కానీ.. విషాదం కారణంగా అది కళ తప్పింది.

లాఠీఛార్జ్ చేయడం వల్లేనా..

అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియంవైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను నిలిపివేశారు.

35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది

ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు. **మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యసాయం అంజేస్తామన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మందికి పైగా రావడంతో ఈ ఘటన జరిగిందని సీఎం చెప్పారు.

Next Story