RCB: తొక్కిసలాటకు కారణం ఆర్సీబీనే!

RCB: తొక్కిసలాటకు కారణం ఆర్సీబీనే!
X
బెంగళూరు తొక్కిసలాట కేసు.. ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు

రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు వి­జ­యో­త్సవ పరే­డ్ సం­ద­ర్భం­గా జరి­గిన తొ­క్కి­స­లా­ట­కు సం­బం­ధిం­చిన దర్యా­ప్తు ని­వే­దిక వచ్చిం­ది. సి­ద్ధ­రా­మ­య్య ప్ర­భు­త్వం కర్ణా­టక హై­కో­ర్టు­కు తన ని­వే­ది­క­ను సమ­ర్పిం­చిం­ది. దీ­ని­లో ని­ర్ల­క్ష్యం, ని­ర్వ­హణ లో­పా­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. పో­లీ­సుల అను­మ­తి లే­కుం­డా వి­జ­యో­త్సవ పరే­డ్‌­కు హా­జ­రు కా­వా­ల­ని ఆర్సీ­బీ ప్రే­క్ష­కు­ల­ను ఆహ్వా­నిం­చిం­ద­ని ని­వే­దిక పే­ర్కొం­ది. జూన్ 4న బెం­గ­ళూ­రు­లో ఆర్సీ­బీ వి­జ­యో­త్సవ పరే­డ్‌­కు ముం­దు ఈ తొ­క్కి­స­లాట జరి­గిం­ది. వి­క్ట­రీ పరే­డ్‌­లో 11 మంది మర­ణిం­చా­రు. అదే సమ­యం­లో, 50 మం­ది­కి పైగా గా­య­ప­డ్డా­రు. ని­వే­ది­క­ను గో­ప్యం­గా ఉం­చా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం కో­ర్టు­ను అభ్య­ర్థిం­చిం­ది, అయి­తే ఈ గో­ప్య­త­కు చట్ట­ప­ర­మైన ఆధా­రం లే­ద­ని కో­ర్టు తె­లి­పిం­ది.

ప్రభుత్వ నివేదిక ప్రకారం...

తొ­క్కి­స­లా­ట­పై ప్ర­భు­త్వం అం­దిం­చిన ని­వే­దిక ప్ర­కా­రం..‘ఐపీ­ఎ­ల్‌-18 సీ­జ­న్‌­లో ఆర్సీ­బీ వి­జ­యం సా­ధిం­చిం­ది. దీం­తో జూ­న్‌ మూడో తే­దీన ఆర్సీ­బీ యా­జ­మా­న్యం పో­లీ­సు­ల­ను సం­ప్ర­దిం­చి వి­జ­యో­త్సవ పరే­డ్‌ గు­రిం­చి చె­ప్పా­రు. వే­డు­క­ల­కు సం­బం­ధిం­చి వారు సమా­చా­రం మా­త్ర­మే ఇచ్చా­రు. అం­తే­గా­నీ.. వే­డు­కల గు­రిం­చి ఫా­ర్మ­ట్‌ ప్ర­కా­రం అను­మ­తు­లు కో­రు­తూ ఎలాం­టి అభ్య­ర్థ­న­లు చే­య­లే­దు. ఇలాం­టి ఈవెం­ట్‌ల కోసం కనీ­సం ఏడు రో­జుల ముం­దే అను­మ­తు­లు తీ­సు­కో­వా­లి. కానీ, అలాం­టి­దే­మీ లే­కుం­డా.. వి­జ­యం అనం­త­రం పో­లీ­సు­ల­ను సం­ప్ర­దిం­చ­కుం­డా­నే ఆర్సీ­బీ తన అధి­కా­రిక ఎక్స్‌ ఖా­తా­లో వి­క్ట­రీ పరే­డ్‌ గు­రిం­చి పో­స్టు పె­ట్టిం­ది. చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో జరి­గే ఈ వే­డు­క­కు ఉచిత ప్ర­వే­శ­మ­ని ప్ర­క­టిం­చిం­ది.

కోహ్లీ పేరు కూడా..

వి­జ­యం అనం­త­రం పో­లీ­సు­ల­ను సం­ప్ర­దిం­చ­కుం­డా­నే ఆర్సీ­బీ తన అధి­కా­రిక ఎక్స్‌ ఖా­తా­లో వి­క్ట­రీ పరే­డ్‌ గు­రిం­చి పో­స్టు పె­ట్టిం­ది. చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో జరి­గే ఈ వే­డు­క­కు ఉచిత ప్ర­వే­శ­మ­ని ప్ర­క­టిం­చిం­ది. ఆ తర్వాత.. మరో పో­స్టు­లో వి­రా­ట్‌ కో­హ్లీ­కి సం­బం­ధిం­చిన వీ­డి­యో­ను కూడా పం­చు­కుం­ది. అం­దు­లో ఆయన ఈ వి­జ­యా­న్ని బెం­గ­ళూ­రు ప్ర­జ­లు, ఆర్సీ­బీ అభి­మా­ను­ల­తో జరు­పు­కో­వా­ల­ని ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు. దీం­తో స్టే­డి­యం సా­మ­ర్థ్యా­ని­కి మిం­చి మూడు లక్షల మం­ది­కి పైగా హా­జ­ర­య్యా­రు. స్టే­డి­యం చు­ట్టూ దా­దా­పు 14 కి.మీ. దూరం వరకు ప్ర­జ­లు గు­మి­గూ­డా­రు. దీం­తో మా­ర్గ­మ­ధ్య­లో, స్టే­డి­యం వద్ద పె­ద్ద మొ­త్తం­లో పో­లీ­సు సి­బ్బం­ది­ని మో­హ­రిం­చాం. ని­ర్వా­హ­కు­ల­కు సరైన ప్ర­ణా­ళి­క­లు లే­క­పో­వ­డం, సం­బం­ధిత అధి­కా­రు­ల­కు ముం­ద­స్తు సమా­చా­రం అం­దిం­చ­డం­లో వి­ఫ­లం కా­వ­డం వల్లే తొ­క్కి­స­లాట జరి­గిం­ది.

క్యాట్ అభిప్రాయమిదే..

కేం­ద్ర పరి­పా­లన ట్రి­బ్యు­న­ల్‌ (CAT) తొ­క్కి­స­లా­ట­కు ఆర్సీ­బీ­నే కా­ర­ణ­మ­ని పే­ర్కొం­ది. రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు ఫ్రాం­ఛై­జీ చే­సిన ప్ర­క­ట­నే తొ­క్కి­స­లా­ట­కు దారి తీ­సిం­ద­ని అభి­ప్రా­య­ప­డిం­ది. ‘చి­న్న­స్వా­మి స్టే­డి­యం బయట సు­మా­రు ఐదు లక్షల మంది ప్ర­జ­లు గు­మి­గూ­డ­టా­ని­కి రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు ఫ్రాం­ఛై­జీ­నే కా­ర­ణ­మ­ని ప్రా­థ­మి­కం­గా తె­లు­స్తోం­ది. పో­లీ­సు­లు మను­షు­లే కదా.. వా­ళ్లే­మీ దే­వు­ళ్లో.. లే­దం­టే ఇం­ద్ర­జా­లి­కు­లో కాదు. ఇలా అను­కో­గా­నే.. అలా భద్ర­తా ఏర్పా­ట్లు చే­య­డా­ని­కి పో­లీ­సుల వద్ద అల్లా­వు­ద్దీ­న్‌ అద్భుత దీ­ప­మే­మీ లేదు’ అని ట్రై­బ్యు­న­ల్‌ పే­ర్కొం­ది.

Tags

Next Story