RCB: హైకోర్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

RCB: హైకోర్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
X
విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు.. ఆర్సీబీ కీలక నిర్ణయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. దీనిపై ఇంకా విమర్శల పర్వం కొనసాగుతోంది. అన్ని వేళ్లూ ఆర్సీబీ వైపే చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్‌లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఓనర్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్‌కు పరిమితంగానే పాస్‌లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కర్ణాటక హైకోర్టును సోమవారం నాడు ఆశ్రయించాయి. తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరాయి.

అదే కారణం

చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్‌లో తమ పాత్ర ఏమీ లేదని ఓనర్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తమ పిటిషన్‌లో పేర్కొంది. విక్టరీ సెలబ్రేషన్స్‌కు పరిమితంగానే పాస్‌లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు తెలిపింది. స్టేడియం గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగిందనీ ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం 1:45 గంటలకు గేట్లు తెరవాల్సి ఉండగా.. 3.00 గంటలకు తెరిచారని, ఒక్కసారిగా జనం చేరుకున్నారని తెలిపింది.

పోలీసుల వైఫల్యమే..

డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ మరో పిటిషన్‌లో పోలీసులు, రాష్ట్ర అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది. 3లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు, రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. తగినన్ని పోలీసు బలగాలను మోహరించకపోవడం కూడా కారణమని తెలిపింది.

Tags

Next Story