pant: స్పైడీ'యుగం' ఆరంభం

టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లీడ్స్లో ఇంగ్లండ్తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్లో పంత్ సెంచరీ చేసి నయా రికార్డ్ సాధించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరుపున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు ధోని(6 సెంచరీలు) పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ అయ్యింది. అయితే, ఈ ఏడూ సెంచరీల్లో 5 సెంచరీలు విదేశాల్లో చేయడం గమనార్హం. పంత్ టెస్టుల్లో లండన్, సిడ్నీ, అహ్మదాబాద్, కేప్టౌన్, బర్మింగ్హామ్, చెన్నై, లీడ్స్లో సెంచరీలు చేశాడు. పంత్ ని తన ఫ్యాన్స్ స్పైడర్ మ్యాన్, స్పైడీ అని పిలుచుకుంటారు అనే సంగతి తెలిసిందే. పేరుకే తగ్గట్టే పంత్ సెంచరీ తర్వాత సమ్మర్ సాల్ట్ వేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్లో స్పైడీ యుగం స్టార్ట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండో రోజు 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. షోయబ్ బషీర్ వేసిన 99.1 ఓవర్కు సిక్స్ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ సాధించాడు. అనంతరం ‘సోమర్సాల్ట్’ విన్యాసం చేస్తూ పంత్ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com