RISHAB PANT: నువ్వో నిజమైన టీమ్మేట్: పంత్

వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ను వీడ్కోలు పలకడంపై భారత క్రికెటర్ రిషభ్ పంత్ స్పందించాడు. ‘బ్రో క్రికెట్లో నువ్వు నీదైన ముద్ర వేశావు. నువ్వో నిజమైన టీమ్మేట్, స్నేహితుడివి. నువ్వొక అద్భుతమైన పవర్హౌజ్వు. నీతో మైదానాన్ని పంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వెస్టిండీస్ క్రికెట్ కోసం నువ్వు చేసిన ప్రతిదానికీ అభినందనలు. నువ్వంటే ఎల్లప్పుడూ గౌరవం’ అని పోస్టు చేశాడు. **వెస్టిండీస్ తరఫున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నికోలస్ పూరన్ అతి తక్కువ కాలంలోనే ఓ మంచి క్రీడాకారుడిగా ఎదిగాడు. వెస్టిండీస్ తరఫున ఎన్నో మరచిపోలేని ఇన్నింగ్స్లు ఆడిన పూరన్.. ఆ జట్టు తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత వెస్టిండీస్ పగ్గాలు చేపట్టిన పూరన్.. కొద్ది కాలంలోనే గుడ్ బై చెప్పాడు. పూరన్ చివరగా వెస్టిండీస్ తర్వాత 2024లో బంగ్లాదేశ్పై ఆడాడు.కోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ను వీడ్కోలు పలకడంపై భారత క్రికెటర్ రిషభ్ పంత్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com