PANT: 148 ఏళ్లల్లో ఒకే ఒక్కడు రిషభ్ పంత్

PANT: 148 ఏళ్లల్లో ఒకే ఒక్కడు రిషభ్ పంత్
X
చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్

టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­ర్, భారత జట్టు వైస్ కె­ప్టె­న్ రి­ష­బ్ పంత్ చరి­త్ర సృ­ష్టిం­చా­డు. లీ­డ్స్ వే­ది­క­గా ఇం­గ్లం­డ్‌­తో జరు­గు­తు­న్న మొ­ద­టి టె­స్ట్‌ రెం­డో ఇన్నిం­గ్స్‌­లో పంత్ మరో శతకం బా­దా­డు. తొలి ఇన్నిం­గ్స్‌­లో సెం­చ­రీ చే­సిన పంత్.. రెం­డో ఇన్నిం­గ్స్‌­లో­నూ మూ­డం­కెల మా­ర్క్‌­ను అం­దు­కొ­ని రి­కా­ర్డు సృ­ష్టిం­చా­డు. 148 ఏళ్ల టె­స్ట్ క్రి­కె­ట్ చరి­త్ర­లో ఒక మ్యా­చ్‌­లో రెం­డు సెం­చ­రీ­లు బా­దిన తొలి ఆసి­యా వి­కె­ట్ కీ­ప­ర్‌­‌­గా పంత్ ని­లి­చా­డు. కు­మార సం­గ­క్కర దగ్గర నుం­చి మహేం­ద్ర సిం­గ్ ధోని వరకు.. ఏ ఆసి­యా కీ­ప­ర్ కూడా ఇది సా­ధిం­చ­లే­ని రి­కా­ర్డు­ను పంత్ అం­దు­కు­న్నా­డు.

దిగ్గజాల సరసన పంత్

టె­స్టు­ల్లో ఒకే మ్యా­చ్‌­లో 2 సెం­చ­రీ­లు బా­దిన రెం­డో వి­కె­ట్ కీ­ప­ర్‌­గా రి­ష­బ్ పంత్ ని­లి­చా­డు. అతడి కంటే ముం­దు జిం­బా­బ్వే ది­గ్గ­జం ఆండీ ఫ్ల­వ­ర్ ఈ ఘనత సా­ధిం­చా­డు. సౌ­తా­ఫ్రి­కా­తో 2001లో జరి­గిన టె­స్ట్‌­లో తొలి ఇన్నిం­గ్స్‌­లో 142 పరు­గు­లు, రెం­డో ఇన్నిం­గ్స్‌­లో 199 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చా­డు ఆండీ ఫ్ల­వ­ర్. టె­స్ట్ మ్యా­చ్‌­లో ద్వి­శ­త­కా­లు బా­దిన ఏడో భారత బ్యా­ట­ర్‌­గా­నూ పంత్ మరో ఘన­త­ను అం­దు­కు­న్నా­డు. సు­నీ­ల్ గవా­స్క­ర్, వి­జ­య్ హజా­రే, రా­హు­ల్ ద్ర­వి­డ్, వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శర్మ, అజిం­క్యా రహా­నె సరసన రి­ష­బ్ స్థా­నం సం­పా­దిం­చా­డు.కె­రీ­ర్‌­లో 44 టె­స్టు­ల్లో 8 సెం­చ­రీ­లు కొ­ట్టా­డు రి­ష­బ్. ఇం­దు­లో 6 వి­దే­శా­ల్లో బా­ది­న­వే కా­వ­డం వి­శే­షం. పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Tags

Next Story