SAINA: కలిసిపోయిన సైనా-కశ్యప్..!

SAINA: కలిసిపోయిన సైనా-కశ్యప్..!
X
దూరం దగ్గరైందంటూ సైనా పోస్ట్

బ్యా­డ్మిం­ట­న్ ప్లే­య­ర్స్ సైనా నె­హ్వా­ల్, పా­రు­ప­ల్లి కశ్య­ప్ జంట నెల క్రి­తం వి­డి­పో­యిం­ది. భర్త పా­రు­ప­ల్లి కశ్య­ప్‌­తో తాను వి­డి­పో­తు­న్న­ట్లు జులై 13న ఇన్‌­స్టా­గ్రా­మ్ స్టో­రీ ద్వా­రా సైనా ప్ర­క­టిం­చా­రు. అయి­తే నెల కూడా కా­క­ముం­దే సైనా అభి­మా­ను­ల­కు ఓ శు­భ­వా­ర్త చె­ప్పా­రు. కశ్య­ప్‌­తో కలి­సి ది­గిన ఫొ­టో­ను షేర్ చేసి.. దూరం దగ్గర చే­సిం­ది అని క్యా­ప్ష­న్‌ ఇచ్చా­రు. తాము మరలా కలి­సి­పో­తా­మ­ని సైనా చె­ప్ప­క­నే చె­ప్పా­రు. కశ్య­ప్‌­తో కలి­సి ది­గిన ఫొ­టో­ల­ను సైనా నె­హ్వా­ల్‌ తన ఇన్‌­స్టా­గ్రా­మ్‌ ఖా­తా­లో షే­ర్‌ చే­శా­రు. ‘కొ­న్ని­సా­ర్లు దూరం సన్ని­హి­తుల వి­లు­వ­ను మనకు నే­ర్పు­తుం­ది. కలి­సి ఉం­డేం­దు­కు మేము మరలా ప్ర­య­త్నం చే­స్తు­న్నాం’ అని సైనా రా­సు­కొ­చ్చా­రు. పో­స్టు­కు రెం­డు హా­ర్ట్‌ ఎమో­జీ­ల­ను జత చే­శా­రు. ప్ర­స్తు­తం ఈ పో­స్ట్ సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ అయిం­ది. ఫా­న్స్ అం­ద­రూ సం­తో­షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ‘భో­లే­నా­థ్ మీతో ఉన్నా­డు, చాలా సం­తో­షం’, ‘హ్యా­పీ ఫర్ బోత్ ఆఫ్ యూ’, ‘మీరు మరలా కల­వా­ల­ని కో­రు­కుం­టు­న్నా­ను’ అంటూ కా­మెం­ట్స్ చే­స్తు­న్నా­రు.

బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట 2018 లో ఒక్కటయ్యారు. వీరిద్దరూ హైదరాబాద్‌ లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరూ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. అప్పుడే వీరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరూ అనేక టోర్నీలు ఆడారు. అలా 2018లో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త పారుపల్లి కశ్యప్‌ తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్‌ స్టా స్టోరీ ద్వారా సైనా నెహ్వాల్ ప్రకటించారు. చివరిసారిగా 2023 జూన్‌ లో ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌ లో సైనా ఆడారు. మరోవైపు కశ్యప్‌ కాంపిటీటివ్‌ బ్యాడ్మింటన్‌ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో సైనా గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story