SEHWAG: సెహ్వాగ్ సతీమణితో బీసీసీఐ అధ్యక్షుడి అక్రమ సంబంధం?

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వైవాహిక జీవితంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నయా ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ నిప్పులు పోసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెహ్వాగ్ సతీమణి ఆర్తి అహ్లావత్తో మిథున్ మన్హాస్ సహజీవనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓవార్త వైరల్గా మారింది. బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వకముందే ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్కు మిథున్ మన్హాస్ మంచి స్నేహితుడు. ఈ క్రమంలోనే ఆర్తి అహ్లావత్తో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ విషయం తెలిసే సెహ్వాగ్..ఆర్తి అహ్లావత్ను దూరం పెట్టాడనే వాదన కూడ వినిపిస్తోంది. గతేడాది సెహ్వాగ్ తన సతీమణి ఆర్తి అహ్లావత్కు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ విడి విడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ విడాకుల వ్యవహారంపై సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ అధికారికంగా స్పందించలేదు. సెహ్వాగ్కు దూరంగా ఉంటున్న ఆర్తి అహ్లావత్.. మిథున్ మన్హాస్తో కలిసి సహజీవనం చేస్తుందని ప్రచారం జరుగుతుంది. గతంలో ఆర్తి అహ్లావత్కు మిథున్ మన్హాస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్ట్లను కూడా తాజాగా వైరల్ అయ్యాయి. సెహ్వాగ్కు మిథన్ మన్హాస్ మిత్ర ద్రోహం చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇది దినేశ్ కార్తీక్, మురళీ విజయ్ స్టోరీలానే ఉందని కామెంట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com