సదా నేను కృతజ్ఞుడిని.. ధావన్ భావోద్వేగం

సదా నేను కృతజ్ఞుడిని.. ధావన్ భావోద్వేగం
జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను నాకు ఇచ్చింది.

భారత జట్టు డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటిసారిగా టీమ్ ఇండియా జెర్సీ వేసుకుని పదేళ్లవుతోంది. ఈసందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకంటే గొప్ప గౌరవం, ఆనందం ఇంకేం ఉంటుంది. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం. నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను నాకు ఇచ్చింది. సదా నేను కృతజ్ఞుడిని అని ధావన్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశాడు.

2004 అండర్ 19 ప్రపంచకప్ లో 505 పరుగులు చేసి అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ సమయంలో జట్టులో అందరూ హేమా హేమీలైన ఆటగాళ్లు ఉండడంతో అతడికి చోటు దక్కలేదు. 2010 వరకు వేచి వుండాల్సి వచ్చింది. చివరికి 2010, అక్టోబర్ 20న భారత వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 136 వన్డేల్లో 45 సగటుతో5, 688 పరుగులు చేశాడు.

2011లో టీ 20, 2013లో టెస్ట్ జట్టులో పాల్గొన్నాడు. 34 టెస్టులాడిన ధావన్ 40 సగటుతో 2,315 పరుగులు చేశాడు. 61 టీ 20 మ్యాచ్ లు ఆడి 1,588 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీలు అనగానే ధావన్ లో ఎక్కడి లేని ఉచ్చాహం వచ్చేస్తుంది. బ్యాటింగ్ లో చెలరేగిపోతాడు. ఇప్పటి వరకు ప్రపంచస్థాయి టోర్నీల్లో 18 మ్యాచ్ లు ఆడిన ధావన్ 65.47 సగటుతో 1,113 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 4 అర్థశతకాలు ఉన్నాయి.

శిఖర్ ధావన్ టీ 20 లీగ్ కెరీర్ 2008లో దిల్లీ జట్టుతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబైకి మారాడు. అక్కడ కూడా తన ప్రతిభ చాటుకున్న ధావన్ అనంతరం హైదరాబాద్ జట్టు అతడిని సొంతం చేసుకుంది. ఏవో కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ జట్టు నుంచి మళ్లీ దిల్లీకి వెళ్లిపోయాడు. 169 మ్యాచ్ ల లీగ్ కెరీర్ లో ధావన్.. 35 సగటు, 126 స్టెక్ రేట్ తో 5,044 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఇప్పటికే రెండు వరుస సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు.

Tags

Read MoreRead Less
Next Story