SHREYAS: "సర్పంచ్‌ సాబ్‌"కు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం

SHREYAS: సర్పంచ్‌ సాబ్‌కు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం
X
ఆసియా కప్ జట్టులో శ్రేయస్‌కు చోటు లేకపోవడంపై అభిమానుల ఆగ్రహం... ఐపీఎల్ 2025లో మెరిసినా.. ఛాంపియన్స్ ట్రోఫీ హీరోకైనా సెలెక్టర్ల నిర్లక్ష్యం!

టీ­మిం­డి­యా స్టా­ర్ బ్యా­ట­ర్, పం­జా­బ్ కిం­గ్స్ కె­ప్టె­న్ శ్రే­య­స్ అయ్య­ర్ ఇటీ­వల సో­ష­ల్ మీ­డి­యా­లో హాట్ టా­పి­క్‌­గా మా­రా­డు. ఆసి­యా కప్ 2025 జట్టు­లో చోటు దక్క­క­పో­వ­డం అభి­మా­ను­ల్లో ని­రా­శ­ను రే­పిం­ది. ఐపీ­ఎ­ల్ 2025లో అద్భు­త­మైన ప్ర­ద­ర్శ­న­తో పాటు, ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ­లో భా­ర­త్ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చి­నా కూడా సె­లె­క్ట­ర్లు అత­న్ని పక్కన పె­ట్టా­రు. ఈ ని­ర్ణ­యం­పై అభి­మా­ను­లు ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అయి­తే శ్రే­య­స్ అయ్య­ర్ పేరు "సర్పం­చ్ సాబ్" ఎలా వచ్చిం­దో చా­లా­మం­ది­కి తె­లి­య­దు. ఈ ని­క్‌­నే­మ్ ఓ వై­ర­ల్ వీ­డి­యో ద్వా­రా వె­లు­గు­లో­కి వచ్చిం­ది. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో ఒక పల్లె­టూ­రు కు­ర్రా­డు ఇం­ట­ర్వ్యూ­లో మా­ట్లా­డు­తూ, శ్రే­య­స్ అయ్య­ర్ అంటే తనకు చాలా ఇష్ట­మ­ని, అత­న్ని సర్పం­చ్ సాబ్ అని పి­లు­స్తా­మ­ని చె­ప్పా­డు.

పం­జా­బ్ కిం­గ్స్‌­కు కె­ప్టె­న్‌­గా వి­జ­య­వం­తం­గా నడి­పి­స్తు­న్నం­దు­కు అత­న్ని గ్రా­మా­ని­కి నా­య­కు­డి­తో పో­ల్చా­డు. "సర్పం­చ్" అంటే గ్రా­మం­లో ప్ర­థమ పౌ­రు­డు, నా­య­కు­డు అని అర్థం. ఈ వ్యా­ఖ్య నె­ట్టింట వై­ర­ల్ కా­వ­డం­తో పం­జా­బ్ కిం­గ్స్ అధి­కా­రిక సో­ష­ల్ మీ­డి­యా హ్యాం­డి­ల్స్ కూడా ఈ పే­రు­ను ఉప­యో­గిం­చా­యి. అక్క­డి నుం­చి ఈ బి­రు­దు వి­స్తృ­తం­గా ప్రా­చు­ర్యం పొం­దిం­ది. ఈ ని­క్‌­నే­మ్‌­పై శ్రే­య­స్ అయ్య­ర్ స్పం­ది­స్తూ, "సర్పం­చ్ సాబ్ అనే ట్యా­గ్ ఎలా వచ్చిం­దో నాకు స్ప­ష్టం­గా తె­లి­య­దు. పం­జా­బ్ కిం­గ్స్ మే­నే­జ్‌­మెం­ట్ ఇచ్చిం­ద­ను­కు­న్నా, కానీ పం­జా­బ్‌­లో ఎక్క­డి­కి వె­ళ్లి­నా అం­ద­రూ నన్ను అదే పే­రు­తో పి­లు­స్తు­న్నా­రు" అని తె­లి­పా­డు. ఇలా ఓ అభి­మా­ను­డి మాట నుం­చి పు­ట్టిన ఈ పేరు, నేడు అయ్య­ర్ అభి­మా­నుల హృ­ద­యా­ల్లో ప్ర­త్యేక స్థా­నం సం­పా­దిం­చిం­ది.

వన్డే కెప్టెన్సీపై ఎలాంటి చర్చలు జరగలేదు

గత కొన్ని రోజులుగా టీమ్‌ఇండియా వన్డే సారథ్యం మార్పుపై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా శుభ్‌మన్ గిల్‌కి బాధ్యతలు ఇస్తారన్న కథనాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం ‘‘అలాంటి చర్చే జరగలేదు’’ అని స్పష్టంచేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మే వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆసియా కప్ తర్వాతే భవిష్యత్‌ సారథ్యం పై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం శుభ్‌మన్ గిల్ వన్డేల్లో 59 సగటుతో ఆడుతున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో సారథ్యం లభించగా, వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. వయసు తక్కువ కావడం అతని ప్లస్ పాయింట్. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సత్తా చాటిన అనుభవం కలిగిన ఆటగాడు. గత వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడి ప్రదర్శన బలంగా నిలిచింది. కాబట్టి గిల్, అయ్యర్ మధ్యే వన్డే సారథ్యం పోటీ సాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Next Story