ipl:సూర్య గాయం ఉత్తిదేనా..? డ్రామా చేశారా..?

ipl:సూర్య గాయం ఉత్తిదేనా..? డ్రామా చేశారా..?
X
ముంబై డ్రామా చేసి లబ్ధి పొందిందా..?

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం డ్రామానే అని కొందరు క్రీడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ జోడి అదరగొడుతున్న నేపథ్యంలో ఫేక్ గాయంతో డ్రామా చేసి మ్యాచ్ ని స్లో చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ పై ఆరోపణలు వస్తున్నాయి. మ్యాచ్ స్లో అయితే మ్యాచ్ రిజల్ట్ పై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అనూహ్యంగా ఆ తర్వాత వాషింగ్టన్ ఔట్ అయ్యాడు. దీంతో సూర్యపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒంటి కాలుతో అయినా ఆడతాడు

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయంపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒంటి కాలితో కూడా క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతాడని స్పష్టం చేశాడు. అతని గాయం పెద్దది కాదని, పూర్తి ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

గిల్‌పై డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో గిల్ మీద గురుతర బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత యువజట్టుకు ఈ సిరీస్ కఠిన పరీక్షే అని డివిలియర్స్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. సీజన్ ఆరంభం నుంచి వరుస విజయాలతో దుమ్మురేపిన జీటీ.. లీగ్ దశ చివర్లో పట్టాలు తప్పింది. ఎలిమినేటర్ ఫైట్‌లో జీటీ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నమెంట్‌ నుంచి వైదొలిగింది.

Next Story