tickets: మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ జనం

tickets: మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ జనం
X
టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న టీ 20 సిరీస్‌కు సంబంధించిన టికెట్ల కోసం భారీగా అభిమానులు ఎగబడ్డారు. టీ­మ్‌­ఇం­డి­యా, దక్షి­ణా­ఫ్రి­కా జట్ల మధ్య అయి­దు టీ20ల సి­రీ­స్‌ జర­గ­నుం­ది. మొ­ద­టి మ్యా­చ్‌ డి­సెం­బ­ర్‌ 9న కట­క్‌ వే­ది­క­గా ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఒడి­శా క్రి­కె­ట్‌ అడ్మి­ని­స్ట్రే­ష­న్‌ తక్కువ సం­ఖ్య­లో టి­కె­ట్ల­ను కౌం­ట­ర్ల­లో వి­క్ర­యా­ని­కి (ఆఫ్‌­లై­న్‌) ఉం­చిం­ది. దీం­తో టి­కె­ట్ల కోసం అభి­మా­ను­లు పో­టీ­ప­డ్డా­రు. టి­కె­ట్‌ కౌం­ట­ర్లు తె­రు­చు­కో­క­ముం­దే ఉదయం నుం­చీ మై­దా­నం బయట వేల సం­ఖ్య­లో అభి­మా­ను­లు పొ­డ­వా­టి క్యూ­లై­న్ల­లో వేచి ఉన్నా­రు. కౌం­ట­ర్లు తె­రు­చు­కో­గా­నే టి­కె­ట్ల కోసం ఎగ­బ­డ్డా­రు. దీ­ని­కి సం­బం­ధిం­చిన వీ­డి­యో సో­ష­ల్‌ మీ­డి­యా­లో వై­ర­ల్‌­గా మా­రిం­ది.

ఒడి­శా క్రి­కె­ట్‌ అసో­సి­యే­ష­న్‌ ఎక్కువ సం­ఖ్య­లో టి­కె­ట్ల­ను వారి సభ్యు­లు, వీ­ఐ­పీ­ల­కు కే­టా­యిం­చి.. చాలా తక్కువ టి­కె­ట్ల­ను మా­త్ర­మే కౌం­ట­ర్ల­లో వి­క్ర­యా­ని­కి ఉం­చ­డం వల్లే ఈ సమ­స్య తలె­త్తిం­ద­ని పలు­వు­రు ఆరో­పి­స్తు­న్నా­రు. టి­కె­ట్ల ధరలు రూ.700 నుం­చి రూ.20,000 మధ్య ఉన్నా­యి. అయి­తే ఫ్యా­న్స్‌ కోసం తక్కువ సం­ఖ్య­లో టి­కె­ట్లు మా­త్ర­మే వి­డు­దల చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. దక్షి­ణా­ఫ్రి­కా­తో టీ­మ్‌­ఇం­డి­యా టీ20 మ్యా­చ్‌­లు కట­క్‌, ము­ల్లా­న్‌­పు­ర్‌, ధర్మ­శాల, లఖ్‌­న­వూ, అహ్మ­దా­బా­ద్‌ వే­ది­క­గా జర­గ­ను­న్నా­యి. ఫి­బ్ర­వ­రి, మా­ర్చి­లో జర­గ­ను­న్న టీ20 వర­ల్డ్‌ కప్‌ 2026 సన్నా­హ­కా­ల్లో భా­గం­గా ఈ సి­రీ­స్‌ ఇరు జట్ల­కు కీ­ల­కం కా­నుం­ది.


Tags

Next Story