IPL: కప్పు కల నెరవేరిన వేళ.. కోహ్లీ కంటతడి

ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కింగ్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి బంతి అయిపోగానే మైదానంలో కూలబడిన కోహ్లీ .. కంటతడి పెట్టా డు. సహచర ఆటగాళ్లు కోహ్లీని ఓదార్చారు. అనుష్క శర్మ కూడా కోహ్లీని చూసి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కోహ్లీ అభిమానులకు అభివాదం చేశాడు.
అనుష్కను హగ్చేసుకుని కూడా...
టైటిల్ సాధించిన అనంతరం కోహ్లీ భావోద్వేగానికి ఆపుకోలేకపోయాడు. అనుష్కను హగ్ చేసుకుని చాలాసేపు ఏడుస్తూ నే ఉన్నాడు. 18 ఏళ్లపాటు ఎదురుచూసిన ఫలితం రావడంతో తాను చాలా భావోద్వేగానికి గురైనట్లు కోహ్లీ తెలిపాడు. ఇది తన జీవితంలో ఓ మధుర క్షణమని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడని కోహ్లీ ... చివరికి తాము సాధించామని అన్నాడు. ఈ కప్పు కోసం తాను చాలా ఏళ్లు గా ఎదురుచూస్తు న్నట్లు వెల్లడించాడు. ఇది జట్టు విజయమని.. ఈ కప్పు గెలిచేందుకు తాము ఎంతో శ్రమించామని అన్నాడు. అభిమానుల మద్ద తుకు ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టా ర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఐపీఎల్ ట్రో ఫీని ముద్దాడాలనేలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ , ఈ క్రమంలో శిఖర్ ధావన్ను అధిగమించాడు. ఈ ఫైనల్కు ముందు కోహ్లీ , శిఖర్ ధావన్ ఇద్దరూ 768 ఫోర్లతో సమంగా ఉన్నారు. అయితే నాలుగో ఓవర్లో పంజాబ్ బౌలర్ కైల్ జేమీసన్ వేసిన బంతిని బౌండరీకి తరలించడం ద్వారా కోహ్లీ ఈ రికార్డు ను తన సొంతం చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com