WPL: అందరిచూపు ఆ 19 మందిపైనే

WPL: అందరిచూపు ఆ 19 మందిపైనే
X
నేడు డబ్ల్యూపీఎల్ మెగా వేలం... వేలంలోకి 277 మంది ఆటగాళ్లు...అందరి కళ్లు కడప బిడ్డ శ్రీచరణిపైనే

హి­ళా క్రి­కె­ట్ అభి­మా­ను­లు ఎంతో ఆస­క్తి­గా ఎదు­రు­చూ­స్తు­న్న టాటా వి­మె­న్స్ ప్రీ­మి­య­ర్ లీగ్ 2026 వే­లా­ని­కి రంగం సి­ద్ధ­మైం­ది. ఈసా­రి జర­గ­బో­యే నా­లు­గో ఎడి­ష­న్ టో­ర్న­మెం­ట్‌­కు సం­బం­ధిం­చిన ఆట­గా­ళ్ల తుది జా­బి­తా­ను బీ­సీ­సీఐ వి­డు­దల చే­సిం­ది. ఈ మెగా ఆక్ష­న్ నేడు న్యూ­ఢి­ల్లీ­లో జర­గ­నుం­ది. మొ­త్తం 73 ఖాళీ స్లా­ట్‌­ల­ను భర్తీ చే­య­డా­ని­కి 277 మంది ఆట­గా­ళ్లు ఈ వే­లం­లో తమ అదృ­ష్టా­న్ని పరీ­క్షిం­చు­కో­ను­న్నా­రు. ఈ వేలం మధ్యా­హ్నం 3:30 గం­ట­ల­కు ప్రా­రం­భం కా­నుం­ది.డబ్ల్యూ­పీ­ఎ­ల్ 2026 వేలం జా­బి­తా­లో మొ­త్తం 277 మంది ప్లే­య­ర్లు ఉన్నా­రు. ఇం­దు­లో భా­ర­తీయ ఆట­గా­ళ్లు, వి­దే­శీ ఆట­గా­ళ్లు ఇద్ద­రూ ఉన్నా­రు. భా­ర­త­దే­శం నుం­చి మొ­త్తం 194 మంది ప్లే­య­ర్లు ఉన్నా­రు. వీ­రి­లో జా­తీయ జట్టు­కు ఆడి­న­వా­రు (క్యా­ప్డ్) 52 మంది కాగా, ఇంకా అవ­కా­శం రా­ని­వా­రు (అన్‌­క్యా­ప్డ్) 142 మంది ఉన్నా­రు. వీ­రి­కి 50 స్లా­ట్లు కే­టా­యిం­చా­రు. ఇక వి­దే­శీ ప్లే­య­ర్లు మొ­త్తం 83 మంది ఉన్నా­రు. ఇం­దు­లో 66 మంది క్యా­ప్డ్, 17 మంది అన్‌­క్యా­ప్డ్ ప్లే­య­ర్లు ఉన్నా­రు. వీరి కోసం 23 స్లా­ట్లు అం­దు­బా­టు­లో ఉన్నా­యి. ఈ డబ్ల్యూ­పీ­ఎ­ల్ 2026 వే­లం­లో ఆట­గా­ళ్ల­కు ని­ర్ధా­రిం­చిన అత్య­ధిక బేస్ ప్రై­జ్ రూ.50 లక్ష­లు­గా ఉంది. ఈ అత్య­ధిక బేస్ ప్రై­జ్‌­లో ఏకం­గా 19 మంది స్టా­ర్ ప్లే­య­ర్లు తమ పే­ర్ల­ను నమో­దు చే­సు­కు­న్నా­రు. వీ­రి­తో పాటు రూ.40 లక్షల బేస్ ప్రై­జ్‌­తో 11 మంది, రూ.30 లక్షల బేస్ ప్రై­జ్‌­తో 88 మంది ప్లే­య­ర్లు ఉన్నా­రు. అంటే వే­లం­లో ఈ టాప్ ప్లే­య­ర్స్ కోసం ఫ్రాం­ఛై­జీల మధ్య తీ­వ్ర­మైన పోటీ ఉండే అవ­కా­శం ఉంది.

శ్రీచరణికి జాక్‌పాట్

డి­ఫెం­డిం­గ్ ఛాం­పి­య­న్ ముం­బై ఇం­డి­య­న్స్‌­తో పాటు రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు(ఆర్‌­సీ­బీ), గు­జ­రా­త్ జె­యిం­ట్స్, యూపీ వా­రి­య­ర్స్, ఢి­ల్లీ క్యా­పి­ట­ల్స్ తమకు కలి­సొ­చ్చే ఆట­గా­ళ్ల­ను రి­టై­న్ చే­సు­కొ­ని అవ­స­రం లేని ఆట­గా­ళ్ల­ను వే­లం­లో­కి వది­లే­సా­యి. ఈ ఐదు ఫ్రాం­చై­జీల రి­టె­న్ష­న్ జా­బి­తా­ల­ను అధి­కా­రిక బ్రా­డ్‌­కా­స్ట­ర్ జియో హా­ట్‌­స్టా­ర్ గు­రు­వా­రం వె­ల్ల­డిం­చిం­ది. ముం­బై, ఆర్‌­సీ­బీ, ఢి­ల్లీ ఐదు­గు­రి ఆట­గా­ళ్ల­ను రి­టై­న్ చే­సు­కో­గా.. యూపీ ఒకే ఒక్క ప్లే­య­ర్‌­ను అం­టి­పె­ట్టు­కుం­ది. గు­జ­రా­త్ జె­యిం­ట్స్ ఇద్ద­రు ఆట­గా­ళ్ల­ను రి­టై­న్ చే­సు­కుం­ది. డబ్ల్యూ­పీ­ఎ­ల్ 2026 వే­లం­లో తె­లు­గు తేజం, ప్ర­పం­చ­క­ప్ వి­న్న­ర్ శ్రీ­చ­ర­ణి పంట పం­డ­నుం­ది. గత సీ­జ­న్‌­లో ఢి­ల్లీ­కి ప్రా­తి­ని­థ్యం వహిం­చిన శ్రీ­చ­ర­ణి­ని ఢి­ల్లీ క్యా­పి­ట­ల్స్ ఈ సారి రి­టై­న్ చే­సు­కో­లే­దు. ము­గ్గు­రు భారత ఆట­గా­ళ్ల­కు మా­త్ర­మే అవ­కా­శం ఉం­డ­టం­తో జె­మీ­మా రో­డ్రి­గ్స్(రూ.2.2 కో­ట్లు), షె­ఫా­లీ వర్మ(రూ. 2.2 కో­ట్లు), నికీ ప్ర­సా­ద్(రూ.50 లక్ష­లు)‌లను మా­త్ర­మే అం­టి­పె­ట్టు­కుం­ది. ఈ ము­గ్గు­రి­తో పాటు మా­రి­జా­నే కాప్(రూ.2.2 కో­ట్లు), అన్న­బె­ల్ సద­ర్లాం­డ్(రూ.2.2 కో­ట్లు)లను తీ­సు­కుం­ది. దాం­తో ఆర్‌­టీ­మ్ అవ­కా­శం కూడా ఢి­ల్లీ­కి లే­కుం­డా పో­యిం­ది. గత సీజన్‌లో రూ. 50 లక్షలకు శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా..రెండు మ్యాచ్‌ల్లోనే ఆమెకు అవకాశం దక్కింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో శ్రీ చరణి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనతోనే టీమిండియాకు ఆడే అవకాశం అందుకున్న శ్రీచరణి ఏకంగా.. మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపికైంది. ఈ టోర్నీలో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది.

Tags

Next Story