Tokyo Olympics: మీ ప్రతిభ అద్భుతం.. గెలుపోటములు సహజం: మోదీ

Tokyo Olympics: తదుపరి రౌండ్లో తలపడటానికి ముందు ఒలింపిక్ ఫెన్సింగ్ మ్యాచ్లో భారతదేశం తొలి విజయాన్ని నమోదు చేసిన భారత ఫెన్సింగ్ ప్లేయర్ సిఎ భవానీ దేవి చేసిన ప్రయత్నాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రశంసించారు.
భవానీ తొలిరౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచింది. కానీ రెండో రౌండ్లో మాత్రం ప్రపంచ మూడో ర్యాకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 715 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆమె ఒలింపిక్స్ ఫెన్సింగ్లో ఒక మ్యాచ్ గెలిచిన తొలి భారతీయురాలిగా గర్వపడుతున్నాను.
అదే సమయంలో రెండో రౌండ్లో ఓడియపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ట్వీట్ చేసింది. ఒలింపియన్ చేసిన ఎమోషనల్ ట్వీట్పై ప్రధాని స్పందించారు: "మీరు మీ బెస్ట్ ఇచ్చారు. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు దేశం చాలా గర్విస్తోంది. మీరు భారతీయ యువతకు ఆదర్శం" అని మోదీ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com