Moon: చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం.. చంద్రుడికే ముప్పుగా మారి..

Moon: చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం.. చంద్రుడికే ముప్పుగా మారి..
Moon: చంద్రుడిపై ధూళి ఎందుకలా ఎగిసిందని గమనించగా.. అది రాకెట్ శకలం వల్ల జరిగిన ప్రమాదమని వారికి అర్థమయ్యింది.

Moon: పరిశోధకులు అనేవారు ఎప్పుడూ ఏ కొత్త ప్రయోగానికి నాంది పలకాలా అన్న ఆలోచనలోనే ఉంటారు. అయితే వారు చేసే ప్రతీ ప్రయోగం సక్సెస్ అవుతుందని చెప్పలేం. కానీ మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా కొన్ని ఫెయిల్ అయిన ప్రయోగాలు ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. ఇటీవల చైనా ఫెయిల్ అయిన ప్రయోగం వల్ల అలాంటి ఓ పెను ప్రమాదమే జరగబోయింది.

అంతరిక్షంలోకి ఎన్నో రాకెట్లు వెళ్తూ ఉంటాయి. అయితే వాటి పని పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను ఏ ప్రమాదం లేకుండా స్మాష్ చేసే బాధ్యతను పరిశోధకులు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. అయితే తాజాగా అలాంటి వ్యర్థాలు అన్నీ కలిసి చంద్రుడికి ముప్పులాగా మారాయి.అంతే కాకుండా అవి అన్నీ కలిసి చంద్రుడిని ఢీ కొట్టే వరకు వెళ్లాయి.

తాజాగా అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌కు సంబంధించిన వ్యర్థం చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లింది. గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఆ వేగానికి చంద్రుడిపై ఉన్న ధూళి ఒక్కసారిగా పైకెగసింది. ఇంత జరిగినా కూడా పరిశోధకుల టెలిస్కోపులకు ఈ రాకెట్ శకలం చిక్కలేదు. చంద్రుడిపై ఎగిసిన ధూళి వల్లే వారంతా అలర్ట్ అయ్యారు.

చంద్రుడిపై ధూళి ఎందుకలా ఎగిసిందని గమనించగా.. అది రాకెట్ శకలం వల్ల జరిగిన ప్రమాదమని వారికి అర్థమయ్యింది. ఇప్పటికే చంద్రుడి చుట్టూ 3 టన్నుల వ్యర్థాలు గోడలాగా ఉన్నాయి. ఆ రాకెట్ శకలం వెళ్లిన వేగానికి ఈ వ్యర్థాల గోడకు బీటలు వచ్చి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2014 చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story