ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : మంత్రి పువ్వాడ అజయ్

X
By - Vijayanand |14 Feb 2023 2:55 PM IST
సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాడవాడ పువ్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలో వాడవాడ పువ్వాడ కార్యక్రమం నిర్వహించిన మంత్రి అజయ్.... ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. 57వ డివిజన్ పరిధిలోని రమణగుట్ట, వికలాంగుల కాలనీ, బురాన్ పురంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీల్లోని పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com