అంగరంగవైభవంగా యాదాద్రీశుడి తిరు కళ్యాణవేడుక
By - Subba Reddy |1 March 2023 3:00 AM GMT
పట్టు వస్త్రాలు, పండ్లు, ముత్యాల తలంబ్రా లు అందజేసిన సీఎం కేసీఆర్ సతీమణి
యాదగిరిగుట్ట పులకించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామివారి తిరు కల్యాణ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. స్వామి, అమ్మవార్ల కల్యాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభు త్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ తమ కుటుంబం తరపున పట్టు వస్త్రాలు, పండ్లు, ముత్యాల తలంబ్రా లు అందజేశారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com