బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌

బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌
ఈడీ, సీబీఐ కేసులతో ప్రతిపక్షాలను వేధించి భయపెట్టాలని బీజేపీ ప్రయత్నం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి హరీష్‌ రావు పర్యటించారు. చెన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. చెన్నూరుకు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హరీష్‌ రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈడీ, సీబీఐ కేసులతో ప్రతిపక్షాలను వేధించి భయపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో లేక గోబెల్స్‌ ప్రచారం చేస్తున్న బీజేపీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీకొడుతుందన్నారు. మనం చేసిందే దేశం మొత్తం చేస్తోందన్నారు. అన్ని రంగాల అభివృద్ధిలో మన రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story