ములుగులో మావోయిస్టులు..పోలీసులు ముమ్మర తనిఖీలు

ములుగులో మావోయిస్టులు..పోలీసులు  ముమ్మర తనిఖీలు

ములుగు జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో.. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఏటూరునాగరాం, మంగపేట, కన్నాయిగుడెం, వెంకటాపురం మండలాల్లో సోదాలు చేశారు. అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. అటు అడవుల్ని జల్లెడపడుతున్నారు. డ్రోన్‌ కెమరాలతో నిఘాను పెంచారు. ఏటూరు నాగరం మండలంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మావోయిస్టులు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.

Tags

Read MoreRead Less
Next Story