సింగరేణి సంస్థలను ఇష్టారీతిన అమ్మేస్తున్నారు: భట్టి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. సింగరేణి సంస్థలను ఇష్టానురీతిన అమ్మేస్తున్నారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కేంద్రం కోల్డ్ మైన్ ను అమ్మకాలకు పెడితే.. బీఆర్ఎస్ మద్దతు తెలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
అలాగే పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ డైవర్షన్ గేమ్ ఆడుతుందని ఆరోపించారు. కావాలనే రాష్ట్రంలో గొడవలు సృష్టించి.. సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థరాత్ర బండి సంజయ్ని అరెస్ట్ చేసి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే గొడవలు చేస్తోందని.. రెండు పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com