అశ్వారావుపేట బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు

X
By - Subba Reddy |5 April 2023 6:00 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, వైస్ ఎంపీపీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇద్దరు నేతలు పరస్పరం తిట్టుకున్నారు. బూతుపురాణంతో ఒకరినొకరు రెచ్చిపోయారు. ఇదంతా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఉండగానే స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో చోటుచేసుకుంది.
మిషన్ భగీరథ తాగు నీటి సమస్యలపై అశ్వరావుపేటలో అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి అందరినీ పిలిచిన ఎంపీడీఓ.. వైస్ ఎంపీపీని ఆహ్వానించలేదు. దాంతో అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com