యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం
By - Subba Reddy |9 April 2023 6:15 AM GMT
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. కొండపై ఆకస్మికంగా డ్రోన్ ఎగరడంతో వెంటనే ఎస్పీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రోన్ ఎగరేసిన వారు హైదరాబాద్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఎలాంటి అనుమతి లేకుండా గుట్టపై డ్రోన్ ఎగరేశారని ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com