తెలంగాణ వీరులను ప్రభుత్వం విస్మరించింది: బండి సంజయ్

X
By - Subba Reddy |9 April 2023 1:15 PM IST
బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని తెలిపారు
తెలంగాణ వీరులను ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని తెలిపారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో అలే నరేంద్ర వర్ధంతి కార్యక్రమం జరిగింది. అలే నరేంద్ర చిత్రపటానికి బండి సంజయ్ నివాళులర్పించారు. తెలంగాణ కోసం అలే నరేంద్ర ఎంతో పోరాడారని కొనియాడారు. ఆదివాసీ, గోండులకు అండగా రాంజీ, కొమురం భీం చేసిన పోరాటం మరవలేనిదన్నారు. తెలంగాణ వీరుల గురించి ముందు తరాలకు తెలియాల్సి ఉందని బండి సంజయ్ చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com