Siddipet : స్కూళ్లో పెచ్చులు ఊడుతున్నా, పట్టించుకోని అధికారులు

X
By - Vijayanand |19 April 2023 4:00 PM IST
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లి UPS స్కూల్లో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బిల్డింగ్ పై కప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రమాదం తప్పింది. విద్యార్థులు లేని సమయంలో ప్రమాదం జరగడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com