పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు: బండి సంజయ్
By - Subba Reddy |26 April 2023 3:00 AM GMT
నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్న బండి సంజయ్ 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు
విద్యార్థులకు పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్న బండి సంజయ్ 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇక అన్ని తప్పులకు బండి సంజయ్ కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. అన్నిటికీ బండి సంజయ్ కారణమైతే ఇక సీఎంగా కేసీఆర్ ఎందుకని నిలదీశారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com