తరుగు పేరుతో రైతులను నిండా దోచుకుంటున్న రైస్ మిల్లర్లు
By - Subba Reddy |4 May 2023 7:15 AM GMT
సూర్యాపేట జిల్లా తమ్మరబండపాలెంలో రైస్మిలర్లు రెచ్చిపోతున్నారు
సూర్యాపేట జిల్లా తమ్మరబండపాలెంలో రైస్మిలర్లు రెచ్చిపోతున్నారు. మాజీ మిల్లర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు వెంపటి మధు రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ రూల్స్ తెలుసా అంటూ రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. తరుగు పేరుతో రైతులను నిండా దోచుకుంటున్నాడు. క్వింటాల్కు రెండు నుంచి నాలుగు కేజీల వరకు తరుగు తీస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ధాన్యం మంచిగా ఉన్నా కూడా తరుగు తీయడమేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com