TS : విజయవంతంగా భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

TS : విజయవంతంగా భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం గొల్లగూడెంలో సాగుతుంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చెపట్టాలని పట్టుదలతో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పట్టనాల్లో కాంగ్రెస్ ప్రభావం మామూలుగా ఉన్నా పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ తన క్యాడర్ చెక్కుచెదరకుండా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముక పోటీ ఉండేటట్లు కనిపిస్తోంది.

పాదయాత్రలో భాగంగా ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు భట్టి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అ ధికారుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు తాము నష్టపోయామని మహిళా రైతులు గోడు వెళ్ల బోసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి 300 బస్తాల ధాన్యం తీసుకొచ్చి 15 రోజులవుతున్నా కాంట పెట్టలేదని, రోజూ కురుస్తున్న వర్షాలతో ధాన్యం మొలకెత్తిందని కన్నీళ్లుపెట్టుకున్నారు. పెట్టిన పెట్టుబడి వచ్చేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story