TS : రైస్‌మిల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

TS : రైస్‌మిల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌
X

రైస్‌మిల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ రెడ్డి చేయి చేసుకున్నాడు. కామా రెడ్డి జిల్లా భిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన వెలుగుచూసింది. అం తకుముందు రైస్‌మిలర్లు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎ మ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఫిర్యాదు చేశారు రైతులు. దీంతో నేరుగా రైస్‌మిల్‌కు వెళ్లారు ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోలుపై రైస్‌మిల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్షపు సమాధానంపై కోపం తెచ్చుకున్న గంప గోవర్ధన్.. సిబ్బందిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story