ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి: మంత్రి పువ్వాడ
By - Subba Reddy |8 May 2023 12:30 PM GMT
ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కామేపల్లి మండలంలోని రాయగూడెం, గోవింద్రాల, పింజరమడుగు గ్రామాల్లో ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి... బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం కొత్తతండా, నెమలిపురి, హరిచంద్రపురంలో నూతనంగా నిర్మించిన రహదారులను ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com