టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. మురళీధర్, మనోహర్రెడ్డిలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రవీణ్ నుంచి 10 లక్షల రూపాయలకు ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నా.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం మాత్రం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది.
గండీడ్ మండలంలో ఇప్పటికే పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారి రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ నాయక్, గోపాల్, నీలేష్, శ్రీనివాస్, తిరుపతయ్య, మైబయ్య, జనార్దన్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరించారు. ఈనెల 5న గండీడ్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భగవంత్కుమార్, అతడి తమ్ముడు రవికుమార్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ్ముడు రవికుమార్ కోసం ప్రశ్నపత్రం కొనేందుకు భగవంత్కుమార్ తన ఖాతా నుంచి లక్షా 75 వేల రూపాయలను బదిలీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com