అంత్యక్రియలకు డబ్బులేక.. ముక్కలు ముక్కలుగా కోసి

X
By - Subba Reddy |12 May 2023 3:30 PM IST
హైదరాబాద్ లంగర్హౌస్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు
హైదరాబాద్ లంగర్హౌస్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్బాడీ అశోక్ దిగా గుర్తించారు. కాళీమందిర్ NFSL కాలనీకి చెందిన అన్నాచెల్లెలు.. ఆటోలో మృతదేహం తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం లంగర్హౌస్ పోలీసుల అదుపులో మృతుడి అన్న రాజు, చెల్లెలు స్వరూప ఉన్నారు. కాగా.. ఇటీవల మద్యానికి బానిసైన అశోక్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేదని చెప్పడంతో అశోక్ను ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ గురువారం ఇంట్లో మృతిచెందాడు. అంత్యక్రియలకు డబ్బు లు లేక అశోక్ మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోసినట్లు అన్నాచెల్లెలు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com