జొన్న రైతుకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్

జొన్న రైతుకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్
2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్నను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్నను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించింది. తెలంగాణలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి.. రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ఎండీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాసంగి సీజన్‌లో పండిన మొత్తం 65వేల 494 మెట్రిక్ టన్నుల జొన్నను కొనుగోలు చేసేందుకు కావాల్సిన.. 219 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

Tags

Read MoreRead Less
Next Story