సిద్దిపేట జిల్లా చేర్యాలలో 20కి పైగా నెమళ్లు మృతి

X
By - Subba Reddy |4 May 2023 11:45 AM IST
తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వ్యవసాయ పొలాలలో 20కి పైగా నెమళ్లు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి
సిద్దిపేట జిల్లా చేర్యాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో.. నెమళ్ల మృతి కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వ్యవసాయ పొలాలలో 20కి పైగా నెమళ్లు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని గమనించిన స్థానిక రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన నెమళ్లను ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా.. వాటికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత నెమళ్ల మృతికి గల కారణాలు చెపుతామని డాక్టర్లు తెలిపారు. అయితే విష గుళికలతో నెమళ్లను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com