శంషాబాద్లో 50 ఎకరాలు కబ్జాకు యత్నం.. హెచ్ఎండీఏ ఉక్కుపాదం

X
By - Subba Reddy |28 March 2023 12:30 PM IST
తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
తప్పుడు భూ రికార్డులు సృష్టించి.. ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారిపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న హెచ్ఎండీఏ చర్యలకు దిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ఆపరేషన్ శంషాబాద్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో హెచ్ఎండీఏ ఎస్టేట్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com