Tarakaratna : తారకరత్నకు నివాళులు అర్పించిన నారా లోకేష్

Tarakaratna : తారకరత్నకు నివాళులు అర్పించిన నారా లోకేష్

తారకరత్నకు నివాళులు అర్పించారు నారా లోకేష్. ఆయన భార్య బ్రాహ్మనితో వచ్చిన లోకేష్ తారకరత్న పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. తిరుపతి జిల్లా పాదయాత్రలో ఉన్న లోకేష్... శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌కు రాగానే నేరుగా తారకరత్న నివాసానికి వెళ్లి ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.

యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అక్కడి నుంచి బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న తుది శ్వాస విడిచారు. ఇప్పటికే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, తో పాటు సినీ ప్రముఖులు తారకరత్న మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.రేపు ఉదయం 7గంటల నుంచి సాయత్రం 4గంటల వరకు తారకరత్న పార్ధివదేహం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం ఫిల్మ్ నగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story