శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం

శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం
నగరంలో జరగనున్నశ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి

శ్రీరామ నవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇవాళ నగరంలో జరగనున్నశ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో పలువురు ప్రజా ప్రతినిధులు, రామయ్య భక్తులు పాల్గొననున్నారు. ఈ శోభాయాత్ర మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమై.. హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు.

ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, బేగంబజార్,సిద్ధంబర్​బజార్,పుత్లిబౌలి, బడిచౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. అంబర్​పేట్​ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు హనుమాన్‌ వ్యాయామశాలకు రానున్నాయి.ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్​పేట్​దగ్గర కలుస్తుందని, శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహిస్తామని భాగ్యనగర్​ఉత్సవ సమితి తెలిపింది.

ఇక శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు భగవత్​రావు తెలిపారు.శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. యాత్రలో భాగంగా శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పలువురు కనిపించనున్నారు. ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరు కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story