నేడు హస్తినకు సీఎం కేసీఆర్‌

నేడు హస్తినకు సీఎం కేసీఆర్‌
ఢిల్లీలో ఈ నెల 4 కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు

సీఎం కేసీఆర్‌ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఈ నెల 4 కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఆయన హస్తినకు వెళ్తున్నారు. నాలుగు రోజులు పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయ పనులను పరిశీలించారు. వసంత విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులు తుది దశకు చేరుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story