TS : ప్రభుత్వం ధాన్యం కొనడంలేదని భట్టికి రైతుల ఫిర్యాదు
By - Vijayanand |5 May 2023 7:37 AM GMT
బీబీనగర్ మండలం గొల్లగూడెం ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి గాను తడిసిన ధాన్యం మొలకెత్తడంతో మొలకెత్తిన ధాన్యాన్ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క గారికి చూపిస్తూ మహిళా రైతులు ధరావత్ మంథి,లక్ష్మి, సక్రిలు చూపించి బోరున విలపించారు. కొనుగోలు కేంద్రానికి 300 బస్తాల ధాన్యం తీసుకొచ్చి 15 రోజులవుతున్న కాంట పెట్టలేదని, రోజు కురుస్తున్న వర్షాలకు ధాన్యం మొలకెత్తిందని పెట్టిన పెట్టుబడి వచ్చేటట్టు లేదని విలపించారు. ప్రభుత్వంతో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com