TS : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ ధర్మం నాశనం : బీజేపీ

X
By - Vijayanand |5 May 2023 2:36 PM IST
జగిత్యాల జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ యత్నించింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి దూసుకెళ్లారు బీజేపీ నేతలు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తుందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. భజరంగ్దళ్ను బ్యాన్ చేస్తామన్న పాయింట్ ను కాంగ్రెస్ మ్యానిఫెస్టో నుంచి తొలగించాలన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com