ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు కేసు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు కేసు
ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి ఆయనపై ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదు అయింది. భూకబ్జా కేసులో ఆయనపై కేసు నమోదు చేశారు.ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి ఆయనపై ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని తన తండ్రి ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల చౌరస్తాలో చేరువుని ఆనుకుని తనకు ఉన్న 1 ఎకరం 20 గుంటల భూమిని తనకు తెలియకుండానే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కాజేశారని ఆమె ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ముత్తిరెడ్డిపై 406,420,463,464,468,471 కింద కేసు నమోదుచేశారు ఉప్పల్‌ పోలీసులు.

గతంలో ఇదే భూమి కబ్జా విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. చెరువుని ఆనుకుని ఉన్న ఇదే స్థలంలో వారం వారం పశువుల సంత జరిగేదని.. కానీ అదే పశువుల సంత స్థలాన్ని ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి రాత్రికి రాత్రే కబ్జా చేసి చుట్టూ ప్రహరి గోడ నిర్మించారని అప్పట్లో విపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి.

Tags

Read MoreRead Less
Next Story