కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం: మంత్రి హరీష్రావు

X
By - Vijayanand |8 Jun 2023 5:57 PM IST
కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని మంత్రి హరీష్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన ఆయన.. ఆరెకటిక సంఘం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 600 పింఛన్ ఇస్తున్నారని.. 2వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అక్కడ మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు ఇస్తున్నామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com