తెలంగాణలో కొత్తగా 10,122 కరోనా కేసులు.. 52 మంది మృతి..!

తెలంగాణలో కొత్తగా 10,122 కరోనా కేసులు.. 52 మంది మృతి..!
సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 99,638 పరీక్షలు నిర్వహించగా మొత్తం 10,122 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 99,638 పరీక్షలు నిర్వహించగా మొత్తం 10,122 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 4,11,905కి చేరుకుంది. అటు కరోనాతో కొత్తగా 52 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మరణాల సంఖ్య 2,094కి చేరింది. ఇక కరోనా నుంచి 6,446 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,221 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story