Basara IIIT: ఎగ్ కర్రీతో ఫుడ్ పాయిజన్.. 1200 మంది విద్యార్థులకు వాంతులు..
By - Divya Reddy |15 July 2022 3:30 PM GMT
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ కర్రీతో భోజనం చేసిన విద్యార్థులంతా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మొన్నటి వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ బాసర స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఐనా అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com