Telangana Mandals: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు.. ఇప్పుడు మొత్తం సంఖ్య 607..

Telangana Mandals: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు.. ఇప్పుడు మొత్తం సంఖ్య 607..
Telangana Mandals: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు కానున్నాయి.

Telangana Mandals: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రజల ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జీవో జారీ చేశారు. వివిధ జిల్లాల్లో కొత్త మండలాల ఏర్పాటుకు రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జిల్లాలో గుండుమల్‌, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు కానున్నాయి.

వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో దుండ్యాల్ మండలం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆలూర్‌,డొంకేశ్వర్ కొత్త మండలాలు కానున్నాయి. బోధన్‌ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం ఏర్పాటు కానుంది. మహబూబబాద్‌ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలాలుగా మారనున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలంగా మారనుంది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం ఏర్పాటు కానుంది. జగిత్యాల జిల్లా పరిధిలో ఎండపల్లి, కోరట్లు డివిజన్ పరిధిలో భీమారం మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తూ రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story